తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని గోషామహల్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇంచార్జుల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి అధికార టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి , శేరిలింగంపల్లి,జూబ్లిహిల్స్ ,గోషామహల్ నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్నారు.అందుకు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయాలన్నారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అబివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేల్లాలని సూచించారు.
see also : ”2014లో నీ తల్లిని ఓడించాం.. 2019లో నిన్నూ ఓడిస్తాం”
see also : కేసీఆర్ మార్చిన బతుకు చిత్రం..!
అతి త్వరలోనే పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.ఏప్రిల్ 27 న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోపు కింది స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లాగా పనిచేయాలన్నారు .పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండ మంచి పదవులు వస్తాయని చెప్పారు.ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ , మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి, రాకేశ్ , హైదరాబాద్ మహిళా ,శిశు సంక్షేమ ఆర్గనైజర్ సుశీలా రెడ్డి , కార్పోరెటర్స్ మమతా గుప్తా మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
see also : ఎల్లో గ్యాంగ్ మైండ్ బ్లాక్ అయ్యేలా షేర్లు చేయండి..!