నాగం జనార్ధన్ రెడ్డి మొదట టీడీపీలో పని చేశాడు.ఆ తర్వాత సొంతగా పార్టీ పెట్టాడు.ఆ తర్వాత ఆ పార్టీను గంగలో కలిపాడు.దీంతో మరల బీజేపీ పార్టీలో చేరాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తుంటారు.తాజాగా ఆయన బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీను కలిశారు అని కూడా వార్తలు వస్తోన్నాయి.
అయితే పార్టీ మారాలని కలలు కంటున్నా నాగం జనార్ధన్ రెడ్డికి ఆదిలోనే దిమ్మతిరిగి బొమ్మ కన్పించే షాక్ తగిలింది.కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఒక ప్రముఖ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ నాగం జనార్ధన్ రెడ్డి పార్టీలోకి వస్తే తీసుకోవద్దు.ఆయన పార్టీలోకి వస్తే ఆయన వలన గ్రూపు రాజకీయాలు పెరుగుతాయి.
పార్టీ చిన్నాభిన్నం అవుతుంది.ఒకవేళ ఆయన్ని పార్టీలో చేర్చుకుంటే పార్టీకే నష్టం తప్ప లాభం ఉండదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు నాగం జనం కానీ క్యాడర్ ఉన్న నాయకుడు కానీ కాదు .ఒకవేళ మమ్మల్ని కాదని పార్టీలో చేర్చుకుంటే తము ఎట్టిపరిస్థితుల్లో సహకరించం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.