వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుకూల మీడియాలు ఇష్టం వచ్చినట్టు బురదవార్తలు రాసి.. జగన్ పై మరో మచ్చ వేయడానికి శ్రాయశక్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తులన్నీ తిరిగి వాళ్ళకే రివర్స్లో తగులుతున్నాయి. వాళ్లు రాసే బుర్రతక్కువ వార్తల వల్ల ఈసారి మాత్రం జగన్కు మేలే జరిగింది.
ఇక అసలు మ్యాటర్లోకి వెళితే.. జగన్ తన అవినీతి సొమ్ముని.. మారిషస్ దేశం తరలించి.. అక్కడ కరిస్సా అనే డమ్మీ కంపెనీలో పెట్టుబడి పెట్టి.. ఆ సంస్థ నుంచి మళ్లీ ఇండియాలోని ఇందూటెక్ జోన్లో పెట్టుబడిగా పెట్టారనేది సీబీఐ అభియోగం చేసి దాదాపు పది కేసులు పెట్టింది. నాడు జగన్ని జైల్లో పెట్టింది కూడా ఈ కేసు పైనే.
See Also:బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..
అయితే మారిషస్ కంపెనీ అనేది డమ్మీ కంపెనీ, ఉత్తుత్తి కంపెనీ అయితే ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ కోర్టుకి ఎందుకు వెళుతోంది. మారిషస్ కంపెనీ లావాదేవీలు అక్రమం అయితే భారత ప్రధానితోపాటు ఆర్థిక శాఖకు ఎందుకు నోటీసులు ఎందుకు ఇస్తోందో అనే లాజిక్ను ఈ బుర్రతక్కువ ఎల్లో మీడియాకి మాత్రం ఎంత చెప్పినా వారి పప్పుమైండ్లకి ఎక్కవు. జగన్ పై ఏదో ఒక విధంగా బురదజల్లి జగన్ పై మచ్చ వేయడమే ఆ ఎల్లో మీడియాల కర్తవ్యం.
ఇక ఆ మారిషస్ కంపెనీ డమ్మీ, ఉత్తుత్తి కంపెనీ అయితే అంతర్జాతీయ కోర్టుకి ఎక్కి లెక్కలు ఎందుకు చెబుతోందనేది ఇప్పుడు మెయిన్ పాయింట్. అయితే గతంలో జగన్ అవినీతి సొమ్ము కోసమే కరిస్సా కంపెనీ పుట్టిందని నాడు ఈడీ, సీబీఐ అభియోగం చేసింది. అయితే ఏ కంపెనీ అయితే డమ్మీ అని సీబీఐ చెప్పిందో.. ఇప్పుడు అదే కంపెనీ అంతర్జాతీయ కోర్టుకు ఎక్కింది. అంటే డమ్మీ కంపెనీతో కోర్టుకు ఎక్కి ఆ దేశం తన పరువు తానే తీసుకుంటుందా… ఏ దేశమూ అలా చేయదు.. అంటే ఇక్కడ అందరూ తెల్సుకోవాల్సిన విషయం ఏంటంటే.. కరిస్సా కంపెనీ అనేది ముమ్మాటికీ ఒరిజినల్ అని తేలింది. మరి నాడు ఇదే కేసులో జగన్ను అడ్డంగా ఇరికించి జైల్లో పెట్టారని.. ఇప్పుడు ఒక్కసారిగా తెర పైకి ఒరిజినల్ మీడియా తెర పైకి రావడంతో.. సాక్ష్యాలతో సహా జగన్ ఎలాంటోడో అందరికీ తెలిసిపోయిందని.. ఇకనైనా ఎల్లో రాతలు ఆపి జనాలకు మేలు చేసే వార్తలు రాయాలని సర్వత్రా చర్చించుకుంటున్నారు.