ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రముఖుల జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న మూవీలకు మంచి ఆదరణ ఉంటున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ రానున్నది.శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ పతాకం మీద పసుపులేటి వెంకటరమణ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ చంద్రోదయం .
ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తయింది అని ఆయన తెలిపారు.చంద్రోదయం మూవీ టీజర్ ను టీడీపీ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ సుధారాణి విజయవాడ నగరంలో సర్కారు సంగీత కాలేజీలో విడుదల చేశారు.
ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరమణ మాట్లాడుతూ సినిమాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు నాడు అంటే ఏప్రిల్ 20న విడుదల చేస్తాం.బాలీవుడ్ నటులు రఘువర్మ,పల్లవి జోష్ ,నాగినీడు తదితరులు నటించారు.ఇప్పటికే ఈ మూవీ టీజర్ చంద్రబాబు నాయుడుకు చూయించమని ఆయన తెలిపారు .