కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచరులు మరోసారి రెచ్చిపోయారు.వివరాల్లోకి వెళ్తే..రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలంలోని నందిగామలో బీటీ రోడ్ శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు వస్తుండగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముందే కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు.
see also :ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!
ఈ సందర్భంగా అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో శిలాఫలకం ధ్వంసం అయ్యింది. గ్రామస్తులు రేవంత్ రెడ్డి వాహనాలను చుట్టుముట్టడంతో ఆయన బైక్ పై వెళ్లిపోయారు. రేవంత్ రెడ్డి మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించారు.
see also :ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!
రేవంత్ కు వత్తాసు పలుకుతున్నారని డీఎస్పీ, సీఐ, ఎస్ఐతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. మంత్రులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తల చేతిలో గాయపడిన రామకృష్ణారెడ్డి, మరో ఇద్దరిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి పరామర్శించారు.
see also :అడ్డంగా బుక్కైన చంద్రబాబు..! రూ.3,300 కోట్ల లెక్కలపై తడబాటు..!!