తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ,కుత్భుల్లా పూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ గత నాలుగు ఏండ్లుగా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తూ అందరి మన్నలను పొందుతూ గ్రేటర్ లోనే ఉత్తమ ఎమ్మెల్యేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు.అందులో భాగంగా ఎమ్మెల్యే తనని నమ్మి ఓట్లేసి
గెలిపించిన ప్రజలకోసం అహర్నిశలు కష్టపడుతూ గతంలో ఎదుర్కొన్న త్రాగునీటి ,కరెంటు,నిరుద్యోగ ,రోడ్ల సమస్య ఇలా పలు సమస్యలను మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు అందనంత ఎత్తులో గెలుపు గుర్రాల జాబితాలోకి చేరిపోతున్నారు.
తాజాగా ఇటివల నగరంలోనే ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్ల లోని సియోటెక్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు గాయపడటమే కాకుండా కొంతమంది అకాలమరణం పొందారు.అయితే ఈ ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఎమ్మెల్యే కెపి వివేకానంద ఉన్నఫలంగా అక్కడకి వెళ్లి క్షత్రగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రులకు తరలించడంలోనూ.అక్కడి సహాయక కార్యక్రమాల్లో ఒక ఎమ్మెల్యేను అనే విషయం కూడా మరిచి మంచి మానవత్వం ఉన్న మనసున్న మహారాజులా అందరితో కల్సి పాల్గొన్నారు.
అంతే కాకుండా ఆ రోజు కనీసం పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఆస్పత్రి దగ్గర ,ప్రమాద స్థలం దగ్గర ఉండి అన్ని చర్యలు తీసుకోవడమే కాకుండా తనవంతుగా అక్కడ ఉన్నవారు ఎమ్మెల్యేనా అనే అనుకునేవిధంగా తగు సహాయ కార్యక్రమాల్లో పాల్గొని మృతి చెందిన వారికి పోస్టు మార్టం ,తీవ్రంగా గాయపడిన వారికి అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స అందేలా ఎమ్మెల్యే కృషి చేశారు.ఈ క్రమంలో సంబంధిత వైధ్యాదికారులతో మాట్లాడటమే కాకుండా ,ఆస్పత్రి సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సరైన వైద్యం అందేలా పాటుపడ్డాడు.ప్రభుత్వంతో ఇటు ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి మృతిచెందిన వారి కుటుంబాలకు ,గాయపడిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండేలా కృషి చేయడమే కాకుండా తన వంతుగా అన్ని రకాలుగా అండగా ఉండటానికి ముందుకొచ్చి మంచి మనసున్న మహారాజు ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ అని అందరిచేత ప్రశంసలు అందుకున్నారు కెపి..