Home / POLITICS / ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!

ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!

తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు .

see also :తేల్చేసిన గల్లా ..!ఇరకాటంలో చంద్రబాబు..!

చివరి దశలో ఉన్న పార్టీ గురించి అంత పొడుగు ఇంత పొడుగు మాటలు చెప్పే నాయకులు నాయకత్వం దగ్గరికి వచ్చే సరికి తమకు చేతకాదంటూ జబ్బలు జారేస్తున్నరు . ఆంధ్రా ముఖ్యమంత్రి కోడలు తెలంగాణ టీడీపీకి అధ్యక్షులు కావాలని అడుగుతున్నరంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి , అడుగు బొడుగు మిగిలిన నాయకులకి ఎంత దుస్థితి వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు . తెలంగాణలో కనీసం ఇంకో 10 – 15 ఏళ్ళు టీ ఆర్ ఎస్ కు తిరుగులేదనే భావన ప్రజల్లో ఏర్పడడంతో ఇప్పుడు తెలంగాణాలో ఉన్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఖాళీ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి . ఎక్కువ శాతం మంది మంచి భవిష్యత్తు ఉన్న టీ ఆర్ ఎస్ వైపే మొగ్గు చూపుతుండడంతో తెలంగాణ టీడీపీ నాయకులకు పాపం ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు .

see also : బీజేపీ బెదిరింపులకు తెలంగాణ భయపడదు

చివరికి చంద్రబాబు కోడలి నాయకత్వం పేరు చెప్పయినా నాలుగు రూపాలు సంపాదించుకోవాలనే ప్రయత్నంగానే తెలంగాణ టీడీపీ నాయకులు ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు అర్ధమవుతున్నది . కాకపోతే టీటీడీపీ నాయకులు ఆత్మాభిమానం చంపుకుని ఆంధ్రా వాళ్లకి తెలంగాణ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అంటుండడంతో తెలంగాణ సమాజం వారిని అసహించుకుంటున్నది .

see also :మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat