ఏపీలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి.ఓట్లేసి గెలిపించిన ప్రజలకు పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను పొందాలంటే ఉండాల్సిన ప్రధాన అర్హత అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,ఆ పార్టీకి సానుభూతి పరులై ఉండాలి.అలా ఉంటేనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుతాయి.
అలా కాకుండా ఇతర పార్టీలకు ముఖ్యంగా వైసీపీకి చెందినవారు అయితే అర్హులైన సరే వారికి అందవు.ఒకనోకసమయంలో పార్టీ మారితేనే ,లేదా పార్టీకి మద్దతు ఇస్తేనే ఆ పథకాలు అందుతాయి.అలా కానప్పుడు వారికి వేదింపులు ఎక్కువగా ఉంటాయి.వారికి ఒక్క పథకం కూడా అందదు.
ఇదే పరిస్థితి కందుకూర్ రూరల్ లో చోటు చేసుకున్నది.వైసీపీ పార్టీకి చెందినవారు అని అర్హులైన సరే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క బ్యాంకు లో కూడా రైతు రుణాలివ్వకుండా స్థానిక అధికార పార్టీ నేతలు చీమకూర్తి మండలంలో మంచకలపాడుకి చెందిన పి రాధకు మహిళా అని కూడా చూడకుండా రానివ్వకుండా వేధించడం మొదలెట్టారు.ఈ క్రమంలో కాళ్ళు అరిగే విధంగా బ్యాంకుల చుట్టూ ఇటు డ్వాక్రా రుణాలు కానీ అటు రైతు రుణాలు కానీ ఇవ్వడంలేదని ఆమె మీడియా ముందు వాపోయారు.