ఉమ్మడి ఏపీ విభజన సమయంలో అప్పటి కేంద్ర పాలకపక్షమైన యూపీఏ గవర్నమెంట్ ఏపీకిచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రత్యేక హోదా.ఇదే అంశం గత సార్వత్రిక ఎన్నికల్లో కీలకంగా మారింది.అందుకే మిత్రపక్షాలుగా కల్సి మరి పోటిచేసిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇచ్చిన ప్రధాన హామీ తమకు అధికారాన్ని కట్టబెడితే పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తామని.అందుకే ఏపీ ప్రజలు బీజేపీ ,టీడీపీ చెప్పిన మాటలు నమ్మి ఇటు రాష్ట్రంలో అటు పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించారు.తీరా అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఎమన్నా సంజీవినా ..అది లేకపోతే ఏపీ ప్రజలు బ్రతకలేరా ..నన్ను నమ్మండి మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తా.దేశంలోనే మొదటి రాష్ట్రంగా ..ప్రపంచమే అసూయపడేలా ఏపీ రాజధానిని నిర్మిస్తాను అని ఆయన గత నాలుగు ఏండ్లుగా ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు.
See Also:రోడ్డు ప్రమాదంలో ఏపీ టీడీపీ సీనియర్ నేత దుర్మరణం..!
మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ పట్టిన పట్టు విడవకుండా ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.విభజన వలన కల్గిన నష్టం తీరుతుంది అని మొదటి నుండి గల్లీ నుండి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు ,ఉద్యమాలు చేస్తూ చిన్న పోరడి దగ్గర నుండి పండు ముసలి వరకు అనేక వర్గాల ప్రజలను ప్రత్యేక హోదా వలన లాభాలు ఏమిటి..!.అది ఇవ్వకపోవడం వలన కలిగే నష్టాలు ఏమిటి అని ప్రతి సందర్భంలో వివరిస్తూ చైతన్యవంతులు చేస్తుంది.ఈ తరుణంలో కేంద్ర సర్కారు తన చిట్ట చివరి బడ్జెట్ అయిన 2018-19కు సంబంధించి వార్షిక బడ్జెటును ప్రవేశపెట్టింది.అయితే ఈ బడ్జెటులో ఏపీకి సంబంధించి ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ ,పోలవరం తదితర పలు అంశాల ప్రస్తావనే లేకుండా తక్కువ మొత్తంలో ఏపీకి నిధులు కేటాయించింది.దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తీవ్ర అభ్యంతరం తెలుపుతూ నిరసనలు ,ఉద్యమాలు ,పార్లమెంటు సమావేశాలలో తీవ్ర అలజడిని సృష్టించింది.
See Also:ప్రత్యేక హోదా పోరాటంలో ఎవరు హీరో..!ఎవరు విలన్..!బాబునా ..జగనా -బాబు సొంత సర్వే..!
దీంతో ఏపీ ప్రజలు తమకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేసిన ద్రోహాన్ని తెలుసుకొని వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు.ఇలాంటి తరుణంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి ప్రత్యేక హోదా కావాలని గళమేత్తారు.ఆ తర్వాత రెండు రోజులకు ప్రత్యేక ఫ్యాకేజీ ద్వారా ప్రత్యేక హోదా కంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి.ఆ హమీను నెరవేర్చాలని బాబు తన నేతల ద్వారా ఢిల్లీ పెద్దలకు కబురు పంపాడు.ఇలాంటి తరుణంలో తాజాగా ప్రత్యేక హోదాపై ఉద్యమాలు జరుగుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి వైపు ప్రజలున్నారో తన ఇంటిల్ జెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయించాడు. ఈ సర్వేలో బాబును నమ్ముతున్నారా .?పవన్ నా .జగన్ నా ..?.ఒక లుక్ వేద్దామా ..!ప్రత్యేక హోదాపై బాబు చేయించుకున్న సొంత సర్వేలో ఆయనకు దిమ్మతిరిగే నిజాలు బయటకు వచ్చాయి .ఈ సర్వేలో గత నాలుగు ఏండ్లుగా అంత ఎందుకు నేటివరకు కూడా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ఫ్యాకేజీకే బాబు మొగ్గు చూపారు.
See Also:YSR లాంటి దమ్మున్న నాయకుడు లేకుంటే.. ఇలానే జరుగిద్ది : బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!!
రేపు ఎన్నికల ముందు కూడా బాబు ఇలాగే వ్యవహరిస్తారు అని డెబ్బై శాతం మంది ప్రజలు తేల్చి చెప్పారు అంట .మరోవైపు రాష్ట్ర విభజన సమయంలోనే సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన జగన్ ఆ తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర అంశాల గురించి ఇటు రాష్ట్ర అటు కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటాలు చేస్తూనే ఉన్నాడు.రేపు ఎన్నికల సమయంలో కూడా తమకు ఎవరు ప్రత్యేక హోదా ఇస్తారో ఆ పార్టీకే కేంద్రంలో మద్దతు ఇస్తారు అని జగన్ కు సపోర్టు చేసిన ప్రజల శాతం తొంబై తొమ్మిది శాతం మంది తేల్చి చెప్పారు.ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే ఆయన వలన ప్రత్యేక హోదా కాదు కదా కనీసం పెన్షన్ కూడా ఇప్పించలేడని ప్రజలు అన్నారు అంట .
See Also:100% రాజ్యసభ కు సంతోష్ అర్హుడే..!
అయితే ప్రజల కష్టాలు తీరాలన్నా ..చదువుకున్న యువతకు ఉద్యోగాలు ..రాష్ట్రంలో పెట్టుబడులు ,పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలి.అందుకు జగన్ అయితేనే కరెక్ట్ ..అతని వలన అయితేనే ప్రత్యేక హోదా వస్తాదని ..అసలు జగన్ కానీ వైసీపీ లేకపోతే రాష్ట్రం విడిపోయి నాలుగు ఏండ్లు అవుతున్న కానీ ప్రత్యేక హోదా గురించి ప్రజలు మాట్లాడుతున్నారు ..బాబు ,పవన్ దానిపై చర్చిస్తున్నారు అంటే దానికి కారణం జగన్ ..జగనే లేకపోతే ప్రత్యేక హోదా ఊసే అందరు మరిచిపోయేవారని మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని ఇంటిల్ జెన్స్ వర్గాల సర్వేలో తేల్చి చెప్పారు అంట .దీంతో కంగు తిన్న బాబు ఏమి చేయాలో పాలుపోక తల పట్టుకున్నారు అంట .
See Also:TNEWS MD సంతోష్ వ్యవహారశైలి…ఆయనకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలివి