ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బుడ్డా అరుణ రెడ్డి ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ కు చెందిన బుద్దా అరుణా
రెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ప్రపంచ్ కప్ లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా అరుణారెడ్డి చరిత్ర సృష్టించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అరుణారెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఆమెను అభినందించి, సత్కరించారు. నగదు ప్రోత్సాహం ప్రకటించారు. ఆమె కోచ్ శ్రీ బ్రిజ్ కిశోర్ కు కూడా సహాయం
అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి పద్మారావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శ్రీ అల్లిపురం
వెంకటేశ్వర రెడ్డి, అరుణారెడ్డి తల్లి శ్రీమతి సుభద్రమ్మ, సోదరి పావని పాల్గొన్నారు.