Home / ANDHRAPRADESH / ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాహుల్‌గాంధీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. రాహుల్‌గాంధీ

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష’లో రాహుల్‌ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన అంశంలో ఆంధ్రులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని, తొలి సంతకం హోదాపైనే ఉంటుందని కూడా ప్రకటించారు.

 అందరం కలిసికట్టుగా ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.రాహుల్‌ గాంధీ ఒక్క నిమిషంలోనే ప్రసంగం ముగించి వేదికపై దిగి వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కాంగ్రెస్‌ నాయకులు రఘువీరారెడ్డి, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావు, సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నాయకుడు మధు ఆత్మగౌరవ సభకు హాజరయ్యారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat