ప్రస్తుతం దేశంలో మహిళలపై అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఎక్కడ చూసిన మహిళలపై అత్యాచార దాడులు ,హత్యలు ఏదో ఒక చోట అరాచకాలకు పాల్పడుతునే ఉన్న సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బల్దియా జిల్లాలో జజౌళి గ్రామంలో నిన్న గురువారం రేష్మా దేవి అనే మహిళా గ్రామానికి చెందిన ఒక వడ్డీ వ్యాపారీ
దగ్గర తీసుకున్న రూ.20వేలకు అప్పు చెల్లించలేదని కారణంతో నిప్పు పెట్టి తగులబెట్టారు .
అయితే ఈ మధ్యనే అప్పును చెల్లించగా వడ్డీ కట్టలేదని గ్రామస్తులు చెబ్తున్నారు.ఈ క్రమంలో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేదని కారణంతో గురువారం ఇంట్లో నిద్రిస్తున్న ఆమెపై కిరోసిన్ పోసి తగులేబట్టారు.మంటలకు ఆమె కేకలు వేయడంతో అంతా నిద్రలేచి రావడంతో నిందితులు పరారయ్యారు .బాధితురాలుని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్చడంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు …