Home / ANDHRAPRADESH / వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!

వైసీపీలోకి 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ మాజీ మంత్రి …!

ఏపీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా అనారోగ్యం బాగోలేదంటూ కారణాన్ని షాకుగా చూపిస్తూ టీడీపీ వ్యవస్థాపక దగ్గర నుండి పార్టీలో ఉంటూ వస్తోన్న బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ను బాబు మంత్రి వర్గం నుండి తప్పించిన సంగతి తెలిసిందే .అంతే కాకుండా
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర జాతీయ కమిటితో పాటుగా జాతీయ కమిటిని ప్రకటించిన సంగతి విదితమే .ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా కళా వెంకట్రావు తో పాటుగా కమిటిలో 105 మంది సభ్యులతో సరికొత్త కమిటిని ప్రకటించాడు .అంతేకాకుండా గతంలో అయితే తనను కమిటి లనుండి తప్పిస్తారు అని ముందే బోజ్జలకు సంబంధిత వర్గాలు సమాచారం అందించాయి
అంట .

గతంలోనే మంత్రి పదవి నుండి తప్పించిన సమయంలో ఆయన పలు మీడియా సమావేశాల్లో బహిరంగంగానే బాబు తీరును దుయ్యబట్టారు .పార్టీలో సీనియర్ నేతలకు తగిన గౌరవం లేదు .మధ్యలో వచ్చిన వారికీ ఉన్న ప్రాధాన్యత గత మూడు దశాబ్దాలుగా పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన తమలాంటి సీనియర్ నేతలకు లేకుండా బాబు చేస్తూ పార్టీ
సిద్ధాంతాలను గంగలో తొక్కాడు అంటూ అప్పట్లో లేఖ కూడా రాశాడు .అంతే కాకుండా పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు అంటూ అవినీతి ఆరోపణలు వచ్చిన వారికీ మంత్రి పదవులు ఉంచి తమలాంటి సీనియర్ నేతలకు అనారోగ్యాన్ని షాకుగా చూపించి మంత్రి పదవి నుండి తప్పించాడంతో తీవ్ర మనస్థాపానికి గురైన బొజ్జల ఆ తర్వాత ఇటు పార్టీ అటు ప్రభుత్వ
కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తోన్నారు .

దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు అని ఆయన అనుచరవర్గం అంటున్నారు .వచ్చే ఎన్నికల్లో బాబు తనను పక్కన పెట్టడానికే అటు మంత్రి వర్గం నుండి ఇటు కమిటీ నుండి బాబు తప్పించాడు అని ..అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసం,తన తనయుడు అయిన బొజ్జల సుధీర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ లో చేరతారని ..అది కూడా త్వరలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కల్సి జగన్ సమక్షంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ గూటికి చేరతారని బొజ్జల అనుచరవర్గం అంటున్నారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat