Home / POLITICS / రేవంత్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌

రేవంత్‌కు మైండ్ బ్లాంక్ అయ్యే నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి షాక్ తిన్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ ఉద్య‌మాన్ని, ప్ర‌జల ఆకాంక్ష‌ను అప‌హాస్యం చేసేందుకు రేవంత్ గావు కేక‌లు వేయ‌గా…సీఎం కేసీఆర్ దానికి గ‌ట్టి పంచ్ ఇచ్చార‌ని..తెలంగాణవాదుల కోణంలో నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. దీనికి  తాజాగా రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపికే నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొంటున్నారు.

see also :ఎవరీ బడుగుల లింగయ్య యాదవ్ ..?

టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్(నల్లగొండ), బండ ప్రకాష్ ముదిరాజ్(వరంగల్) పోటీ చేయనున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు.. రేపు రాజ్యసభ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. యాదవుల కోటాలో బండా ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌కు స్థానం దక్కింది.

see also :ఆర్మూర్ కాంగ్రెస్ కు బిగ్ షాక్ -టీఆర్ఎస్ లో చేరిన నేతలు ..!

జోగినపల్లి సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్ జిల్లా బోయిన్ పల్లి మండలం కొదురుపాక. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ఉద్య‌మ గ‌ళం వినిపిస్తున్న‌ప్ప‌టి నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. గ‌ల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వ‌ర‌కు గ‌ళం వినిపిచ్చిన‌ప్ప‌టి నుంచి, కేసీఆర్ ప్రాణ‌త్యాగానికి సిద్ధ‌మై దీక్ష చేసిన‌ప్పుడు సంత‌న్న వెంట ఉన్నారు. అయితే ఆయ‌న రాజ్య‌స‌భ అభ్య‌ర్థిత్వం ప్ర‌తిపాద‌న‌లో ఉన్న స‌మ‌యంలో కాంగ్రెస్ నేత రేవంత్ వ్య‌తిరేకించారు. గ‌గ్గోలు పెట్టారు. అయితే తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంతో రేవంత్ మైండ్ బ్లాంక‌యింద‌ని అంటున్నారు. ఉద్య‌మ నేతకు ప‌ట్టం క‌ట్టాల‌నే ప్ర‌జ‌ల భావ‌న‌కు విరుద్ధంగా రేవంత్‌ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు సైతం మండిప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat