Home / ANDHRAPRADESH / టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

టీడీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి రూ.3వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కునేడు టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన ఓ బ‌ఢా నేత.. టీడీపీలో ప‌లుకుబ‌డి ఉన్న నేత‌గా అంద‌రికీ చెప్పుకుంటాడు. కానీ, ప్ర‌జ‌ల కోసం న‌యా పైసా ప‌నిచేయ‌డు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అంద‌రినీ బెదిరిస్తుంటాడు. కానీ, త‌న‌కు ఓట్లేసి గెలిపించిన ప్ర‌జ‌ల‌కు ఏ స్థాయిలోనూ సాయ‌ప‌డ‌డు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు. టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా అవుతోంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అండ ఉంద‌ని చెప్పుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణంలో తారా స్థాయిలో అవినీతికి పాల్ప‌డిన సీఎం ర‌మేష్‌కు నేడు టీడీపీ అధిష్టానం రాజ్య‌స‌భ సీటు కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రేపు రాజ్య‌సభ స‌భ్య‌త్వానికి నామినేష‌న్ వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు సీఎం ర‌మేష్‌.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న వార్త మేర‌కు…  సీఎం ర‌మేష్ రూ.3వేల కోట్ల అవినీతి విష‌యానికొస్తే..!!

2014 సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది.

see also : చంద్రబాబు దొంగ లెక్కలు ..పక్క ఆదారాలతో డోన్ వైసీపీ ఎమ్మెల్యే

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న భారీ ప్రాజెక్టుల‌కు సంబంధించిన కాంట్రాక్టు ప‌నుల‌ను రాజ్యస‌భ స‌భ్యుడు, ఎంపీ సీఎం ర‌మేష్‌కు కేటాయించ‌డం జ‌రిగింది. హంద్రీనీవాలోని ప‌ది ప్యాకేజీల ప‌నులు, అలాగే హంద్రీనీవా కాలువ వెడ‌ల్పు ప‌నుల‌ను ర‌మేష్ సంస్థ‌ల‌కే అప్ప‌గించారు సీఎం చంద్ర‌బాబు. అంతేకాక‌, గాలేరు న‌గ‌రి ఫేజ్ – 1లో రెండు ప్యాకేజీల విలువ రూ.40కోట్ల అంచ‌నా వ్య‌యం ఉన్న‌ప్పుడు సీఎం ర‌మేష్‌కు కాంట్రాక్టును అప్ప‌గించ‌గా.. ఇప్ప‌టికీ ఆ ప‌నులు పూర్తి కాలేదు. ఈ ప‌నుల‌కు సంబంధించి ప్ర‌స్తుత అంచ‌నా విలువ రూ.100 కోట్ల‌కు పెరిగిందంటూ సీఎం ర‌మేష్ ప్ర‌భుత్వానికి మ‌ళ్లీ బిల్లు పెట్ట‌డం గ‌మ‌నార్హం. సీఎం ర‌మేష్ సంస్థ‌కు కేటాయించిన రూ.120 కోట్ల వంశ‌ధార ప్రాజెక్టు ప‌నులు కూడా ఇంకా పూర్తి కాలేదు. గుత్తి – తాడిప‌త్రి నేష‌న‌ల్ హైవే ప‌నులల‌తోపాటు గండికోట ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ ప‌నుల‌ను కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ సీఎం ర‌మేష్‌కే కేటాయించ‌డం గ‌మ‌నార్హం.

see also : దళితుడిని అయినందునే తీవ్రంగా మరోసారి చంద్రబాబు అవమానించారని..వర్ల రామయ్య తీవ్ర నిరాశ

సీఎం ర‌మేష్ కాంట్రాక్టుల‌ దందాలు అంత‌టితో ఆగ‌లేదు. 60సీ నిబంధ‌న కింద టీడీపీ అధికారంలోకి రాక‌ముందు కాంట్రాక్టుల‌ను చేజిక్కించుకున్న వారిని బెదిరించి మ‌రీ కాంట్రాక్టుల‌ను త‌న సంస్థ‌కే వ‌చ్చేలా ప్ర‌భుత్వంపై ఒత్త‌డి తెస్తున్నారు. కాంట్రాక్టులు ద‌క్కించుకున్న సీఎం ర‌మేష్ సంస్థ‌లు ప‌నుల‌ను పూర్తి చేస్తున్నాయా..? అంటే అదీ లేదు. సీఎం ర‌మేష్ తీరుపై టీడీపీలోనూ తీవ్ర అసంతృప్తి ఉండ‌టంతో ఇప్ప‌టికైనా సీఎం ర‌మేష్ కాంట్రాక్టుల దందాల‌పై దృష్టి సారించాల‌ని టీడీపీ నేత‌లే చంద్ర‌బాబునాయుడు దృష్టికి తీసుకు పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఎంపీ సీఎం ర‌మేష్ తీరు ‘ప‌ని త‌క్కువ‌.. ఆత్ర‌మెక్కువ’ అనే రీతిలో ఉంద‌ని టీడీపీ నేత‌లే అంటున్నారు.

see also : 23 ఏళ్ల నటి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య

ఇదిలా ఉండగా సీఎం ర‌మేష్‌ను ఏపీ నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌ చేయ‌డంపై టీడీపీ నేత‌లే సీఎం చంద్ర‌బాబుపై పెద‌వి విరుస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీకి సేవ‌ల చేసిన ద‌ళితుడు, వ‌ర్ల రామ‌య్య‌ను కాద‌ని, ప్రాజెక్టుల పేరుతో రూ.3వేల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డ సీఎం ర‌మేష్‌ను ఎలా రాజ్య‌స‌భ‌కు పంపిస్తారని చంద్ర‌బాబుపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat