రాయలసీమలో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ టీడీపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. కాగా, ఇవాళ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష పార్టీ వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని, రాయలసీమలో టీడీపీ చేసిన అభివృద్ధితో 2019లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీపీపీని రాయలసీమలో నెలకొల్పారన్నారు. అలాగే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో సోలార్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్టును నిర్మిస్తున్నారన్నారు.
see also : వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!!
see also : కేసీఆర్ అంత దమ్ముతో సవాల్ చేయగలరా..? మంత్రి కేటీఆర్
see also : జనసేన పార్టీలోకి మాజీ మంత్రి …!
అనంతపురం జిల్లాలో ఎప్పుడూ లేనంతగా నీటి నిల్వలు పెరిగాయని, ఇందుకు కారణం సీఎం చంద్రబాబు ఆలోచనా విధానమేనని, ముందుచూపుతో హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. దీంతో 40 టీఎంసీల నీటితో అనంతపురం సస్యశ్యామలం అయిందన్నారు. రాయల సీమలో కియా మోటార్స్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేశారన్నారు. దీంతో అనంతపురం ప్రజలు ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లేపని తప్పిందన్నారు. అనంతరం సీఎం రమేష్ కడప రాజకీయం గురించి మాట్లాడుతూ.. కడపలో ప్రతీ కార్యకర్త, ప్రతీ నాయకుడు నాకు తెలుసు, వారితో ఎప్పుడూ కలిసిమెలిసి పనిచేస్తూ కడపలో టీడీపీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు సీఎం రమేష్.