ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది అధికార టీడీపీ పార్టీలో జాయిన్ అయిన సంగతి తెల్సిందే.అయితే ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన చేస్తూ..ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానపరుస్తూ..ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే అన్నా
వెంకట రాంబాబు హైకోర్టును ఆశ్రయించాడు.
See Also:మరో ఇద్దరు టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు ..!
ఈ వ్యాజ్యం మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ,ఏపీ అసెంబ్లీ కార్యదర్శి,న్యాయశాఖ కార్యదర్శి కి నోటీసులు జారీచేసింది.దీంతో ఉమ్మడి హకోర్టు దెబ్బకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలలో కొంతమంది బ్యాక్ టూ వైసీపీ అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.ఇటివల బహిరంగంగానే కర్నూలు జిల్లాకు చెందిన కోడుమూరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాంధీ మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అత్మభిమానాన్ని చంపుకొని మరి నోట్ల కట్ల కోసం ..ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపిన తాయిలాలకు లొంగి పార్టీ మారారు.
See Also:YS జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!
కానీ నేను యాబై మూడు వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను.బాబు అభివృద్ధి చేస్తాను అంటే పార్టీ మారాను.కానీ బాబు పార్టీ మారిన మమ్మల్ని అడ్డుపెట్టుకొని ఎట్లాగైనా జగన్ ,వైసీపీ పార్టీను నాశనం చేయాలనీ చూశారు తప్పా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మరిచిపోయారు.త్వరలోనే తనతో పాటు బద్వేలు ఎమ్మెల్యే జయరాముడు కూడా వైసీపీ లో చేరతామని అప్పట్లో ప్రకటించి పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా హైకోర్టు నోటీసులు నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించే అప్పట్లో మణిగాంధీ ఇలా వ్యాఖ్యానించారు అని ..త్వరలోనే వీరిద్దరూ వైసీపీ గూటికి రావడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు ..
See Also:2019లో జగనే సీఎం.. లగడపాటి రాజగోపాల్ సంచలన వ్యాఖ్యలు..!!