తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో ఏప్రిల్ మాసంలో విశ్వకర్మల సమ్మేళనం నిర్వహించేందుకు సహకరిస్థామన్నారు. త్వరలో స్పీకర్ మధుసూదనాచారి తో చర్చించి తేది నిర్ణయిస్తామని మంత్రి వివరించారు.
విశ్వకర్మలను బీసీ ఏ గ్రూప్ లో చేర్చాలని ,విశ్వకర్మలందరికి హెల్త్ కార్డులు అందించాలని సంఘం నాయకులు శ్రీనివాస్ చారి, బాలుచారి,రవిందర్ చారి,వెంకటాచారి, వినోద్ చారి,తారక చారి,యాదగిరాచారి,నర్సింగ్ చారి తదితరులు స్పీకర్, మంత్రి మహేందర్ రెడ్డి ని వినతీపత్రంలో కోరారు. అలాగే 50 ఏళ్ళు నిండిన విశ్వకర్మల కు పించన్లు ఇవ్వాలని కోరారు. విశ్వకర్మల సమస్యలను సీఎం కేసీఆర్ కు నివేదిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి, స్పీకర్ మధుసూదనాచారి అన్నారు.