తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా అన్ని వర్గాల కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు పదకొండు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీచేశామని .మరో పద్నాలుగు వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామని తెలిపారు. త్వరలోనే వాటిని భర్తీచేస్తామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు .