ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ విజయ సాయి రెడ్డి అధికార టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఆ పార్టీ ఎంపీ సీఎం రమేష్ కు దిమ్మతిరిగి బొమ్మ కనపడే సవాలు విసిరారు.ఆయన ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ విసిరిన
సవాలును స్వీకరిస్తున్నాననిఅన్నారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చలకోసం దొంగలముఠా నాయకుడు చంద్రబాబు వచ్చినా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సమస్యల గురంచి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతారు? ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, మంత్రి అరుణ్జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫైచేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుంది’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
నాలుగైదు రోజుల్లో సీఎం రమేశ్ బండారాన్ని బయటపెడతాం. ఉత్తరాఖండ్లో పనులు చేయకుండా బిల్లులు తీసుకున్నాడు. సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేశాడు. ఆయన దెబ్బకి త్వరలో కొన్ని బ్యాంకులు దివాలా తీయబోతున్నాయి. ఇలాంటి దొంగలా మాపై విమర్శలు చేసేది? ఇవాళ రాజ్యసభలో టీడీపీ ఎంపీలు జైట్లీతో ఏం మాట్లాడారో వెల్లడించేదమ్ముందా?..ఒక్కడ్నే వస్తా ..నువ్వోచ్చిన సరే ..చంద్రబాబోచ్చిన సరే..విజయవాడ సాక్షిగా బహిరంగంగా మీ బండారం బయటపెడతా ..’’అని విజయసాయి సవాలు విసిరారు.