Home / ANDHRAPRADESH / వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!

వైఎస్ జగన్ @1600..పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు..!

ఆంద్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు కాని హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో మంగళవారం పాదయాత్ర 1600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ అక్కడ రావి మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించారు.

అంతకుముందు 121వ రోజు సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించారు. ఆయన వెంట నడించేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారందరితో కలిసి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. వైఎస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6న వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.180 రోజుల పాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కడప జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తికాగా ఈ నెల 12న ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది. అంతేగాక ఈ పాదయాత్రలో వైఎస్ జగన్ కు  ప్రజల అభిమానం  పెరుగుతుంది తప్పా..అస్సలు తగ్గడం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat