ప్రస్తుత రోజుల్లో మానవత్వం అంటే పుస్తకాల్లో ..సినిమాల్లోనే ఉంటుంది ..నేటి సమాజంలో వాస్తవంగా దొరకదు అని చెప్పుకునే రోజులు వచ్చాయినిపిస్తుంది.పట్టపగలు తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉన్న మహిళను అట్లనే గాలికి వదిలేశారు.మహిళా అని ఒక్కరు కూడా కనికరించలేదు.
ప్రమాదంలో ఉన్న ఆమెను చూసి ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అంబులెన్స్ కు కానీ ఫోన్ చేయలేదు.అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో అరవై ఐదేళ్ళ మహిళా రోడ్డును దాటుతుండగా అటుగా వేగంగా వచ్చిన ఒక బైకు డీకొట్టి వెళ్లిపోయింది.
దీంతో తీవ్ర గాయాలు కావడమే కాకుండా ఏకంగా రక్తస్రావం జరిగింది.దాదాపు మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పాటు రోడ్డుపైన పడి ఉంది.అయితే మానవత్వం లేని మనుషులు గుంపుగా గుమి కూడి ఉండటంతో అటుగా వచ్చిన పోలీసులు తమ వాహనాన్ని ఆపి మరి తెల్సుకొని ఆ మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.