లోక్ సభ వచ్చే సోమవారానికి వాయిదా పడింది.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ తన సీట్లో ఆశీనులు కాకముందే తమిళ నాడుకు చెందిన అన్నాడీఎంకే సభ్యలు ఆందోళనకు దిగారు.
ఈ క్రమంలో వీ వాంట్ కావేరో వాటర్ బోర్డు అంటూ పెద్దేత్తున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్ళారు.దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేసిన స్పీకర్ తర్వాత ప్రారంభమైన సభలో కూడా సభ్యులు తీవ్ర గందరగోళానికి దిగడంతో చేసేది ఏమిలేక సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్ ..