ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన విజయసాయి రెడ్డి నిన్న మంగళవారం లోక్ సభలో భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా కాళ్ళు పట్టుకున్నాడు అని ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన సంగతి విదితమే.
అయితే ఈ వ్యాఖ్యల మీద విజయసాయి రెడ్డి ఏకంగా రాజ్యసభ సెక్రటరీకి లేఖ కూడా రాశారు వీడియో పుటేజీ విడుదల చేయాలనీ ..అయితే తమ పార్టీ నేత చేసిన అసత్య ఆరోపణలను సత్యమని నిరూపించాలని ఏకంగా ఫోటో మార్పిడి చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు కు చెందిన ఐటీ విభాగం అంటూ వైసీపీ శ్రేణులు ఖండిస్తూ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది .ఆ పోస్టులో విజయసాయి రెడ్డిను బుక్ చేయబోయి ఇలా అడ్డంగా బుక్ అయ్యారని లోకేష్ బాబు అండ్ బ్యాచ్ మీద వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు ..మీరు ఒక లుక్ వేయండి..