ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దోపిడీకి రాష్ట్రంలోని పంచభూతాలే కాదు ఏకంగా కేంద్రమిచ్చిన నిధులు కూడా లెక్క లేకుండా పోతుంది.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ
ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసింది.
తాజాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర సర్కారు ఇచ్చిన నిధుల్లో ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను ఎమ్మెల్యేల అధికారక నివాసాల కోసం ..వారి కార్యాలయాల నిర్మాణం కోసం వినియోగించినట్లు బాబు సర్కారు కేంద్రానికి సమర్పించిన యూసీలలో పేర్కొన్నది.
ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రమిచ్చిన నిధుల్లో ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లతో ఎమ్మెల్యేల ,ఎమ్మెల్సీల కార్యాలయాలు ,నివాసాలు కట్టించారని లెక్కలు చెప్పారు కదా .ఇప్పుడు ఆ భవనాలు కానీ కార్యాలయాలు కానీ ఎక్కడ ఉన్నాయి ..ఎవరికిచ్చారు.ఎవరికీ చూపించారు .నాకైతే ఇప్పటివరకు నాకు కేటాయించలేదు .అది నాకోసం ఎక్కడ కట్టారో చెప్తే అక్కడకి వెళ్లి ఉంటాను అని ఆయన హేద్దేవా చేశారు.