దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది.అందులో భాగంగా తమ సంస్థ నుండి గృహ రుణాలను తీసుకునేవారికి తీపి కబురును అందించింది.ఈ క్రమంలో ఈ నెల ముప్పై ఒకటో తారిఖు వరకు తీసుకునే గృహ రుణాలపై ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది.
ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో అధికారక పేజీ అయిన ట్విట్టర్ లో వెల్లడించింది.అంతే కాకుండా ఆకర్షనీయమైన వడ్డీరేట్లు కూడా ఉంటాయని ఆ సంస్థ తెలిపింది.మిగత సమాచారానికి దగ్గరలోనే తమ బ్యాంకులను సంప్రదించాలని ట్విట్టర్ లో పేర్కొన్నది .