తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు.
ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా ఆరా తీశారు. తండాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా మార్చాలని సీఎం కేసీఆర్ అప్పట్లోనే నిర్ణయించుకున్నారు.
ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలుగా చేస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు. సరిగ్గా పదేండ్ల కిందట ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రస్తుతం బాలానగర్ మండలం నేలబండ తండాను గ్రామ పంచాయితీగా మారుస్తున్నట్టు ప్రకటించడంతో లంబాడీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.