ఇటీవల నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం డిల్లీలో ఘనంగా జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. పలు పార్టీలకు చెందిన కొత్తసభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో భాగంగా టీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.టీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్ ముదిరాజ్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ఎంపీలు తెలుగులో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.డిల్లీలో ఎంపీ సంతోష్ కుమార్ ను కలిసి రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ వాసుదేవారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
Tags joginapalli santhosh kumar pochampalli srinivas reddy t news md trs party