టీఆర్ఎస్ పార్టీ యువనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మరోమారు తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. సానుకూల, వ్యతిరేక పరిణామాల విషయంలో స్తితప్రజ్ఞత కలిగి ఉన్న నాయకుడు ఎలా వ్యవహరించాలో చాటిచెప్పారు. ఈ పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పలు సందర్భాల్లో ఎదురయ్యే నిరసనలను తాను సానుకూలంగా తీసుకుంటానని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలపడమే ఇందుకు కారణం. ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి మంత్రి కేటీఆర్ ఇలా స్పందించారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బుధవారం మంత్రి కేటీఆర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా యూనివర్సిటీ కాలేజీ విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. స్థానికంగా ఉన్న అధికారులు సర్దిచెప్పినప్పటికీ వారు కొనసాగించడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెడుతానని హామీ ఇచ్చారు. అయితే ఈ ఉదంతాన్ని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంటూ మంత్రి కేటీఆర్కు నిరసనలని తెలిపింది. దీనిపై ఓ ట్వీట్లో కేటీఆర్ స్పందించారు. ‘ఇలాంటి నిరసనలు మా రాజకీయ జీవితంలో ఓ భాగం. వీటిని సానుకూలంగా తీసుకొని ముందుకు సాగాలి. ఆ కాలేజీ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం’ అని హుందాగా స్పందించారు.
Part & parcel of my job ? Will take it positively and work on providing the students of school of Mining better infrastructure https://t.co/5SmwGBuKAH
— KTR (@KTRTRS) April 4, 2018