భరత్ అనే నేను టాలీవుడ్ సూపర్ స్టార్ ,స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ .ప్రముఖ దర్శకుడు కొరటాల శివ నేతృత్వంలో దానయ్య డీవివి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను అందించగా ఇప్పటివరకు మూడు పాటల లిరిక్స్ ను విడుదల చేశారు.వీటిలో ఒకదానికి ఒకటి మించి అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా వచ్చాడయ్యో సామీ అనే పాట
లిరిక్స్ విడుదలైన గంటలోనే నాలుగు లక్షలమంది చూశారు.కొన్ని లక్షల మంది ఆ సాంగ్ ను డౌన్ లోడ్చే సుకున్నారు .అయితే ఈ సాంగ్ విన్నంత సేపు ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినుఊహించుకున్నారు ఆసాంతం ..
నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో భాగంగా చేసిన హామీలు ..ప్రజల నుండి విశేష ఆదరణ ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్రకు లభిస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు ,వైఎస్సార్ అభిమానులు ఆనందంలో ఉన్నారు.ఈ తరుణంలో మహేష్ నటిస్తున్న భరత్ అనే నేను మూవీ లేటెస్ట్ సాంగ్ లో వచ్చే ప్రతి పాట లైన్ జగన్ చేస్తున్న విధానాన్ని తలపిస్తుంది.జగన్ పాదయాత్ర మొదలెట్టిన ఘట్టం దగ్గర నుండి ప్రజలకు చేరువై విధానం ..ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఏమి చేస్తాం ..హామీలు కురిపించే విధానం ఇలా పలు అంశాలు ఆ పాటలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అయితే ఇదే అంశం గురించి జగన్ చేస్తున్న పాదయాత్ర ,మూవీలో మహేష్ చేసే పాదయాత్ర ఒకటే కాబట్టి ..ఆయన్ని ప్రేరణగా తీసుకొని రాయించారు అని .అయితే ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ నుండి తాజా సాంగ్ వరకు ప్రతిదీ చంద్రబాబు అండ్ బ్యాచ్ కు వ్యతిరేకంగా ఉండటంతో ఈ మూవీ గురించి తెలుగు తమ్ముళ్ళు తెగ కంగారు పడుతున్నారు ..ఈ మూవీ ఎన్నికలకు ముందు తమ కొంప ఎక్కడ ముంచుతుందో అని ..అయితే మీరు ఒక్కసారి ఈ సాంగ్ వింటూ జగన్ ను ఊహించుకోండి ఎలా ఉంటుందో ..!