Home / ANDHRAPRADESH / సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటే నాకు ఆదర్శం -జగన్ …

సీఎం కేసీఆర్ చెప్పిన ఆ మాటే నాకు ఆదర్శం -జగన్ …

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే .తాజాగా ఆయన గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గత నాలుగు ఏండ్లుగా వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలోని హామీలు ప్రత్యేక హోదా ,రైల్వే జోన్ లాంటి తదితర హామీలను నెరవేర్చాలని అలుపు ఎరగని పోరాటం చేస్తున్న సంగతి విదితమే .

అయితే నిన్న శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి అమర నిరాహార దీక్షకు దిగిన సంగతి విదితమే .అయితే దీని గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేశారో ఆవిధంగా కోట్లాడి ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు కారణమైన ప్రత్యేక హోదాను తీసుకొస్తాను.

అవసరమైతే ఉద్యమ సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ గారు చెప్పినట్లు ప్రజలకు న్యాయం జరుగుతుందంటే గొంగళి పురుగును అయిన ముద్దు ఆడతా అని అన్నమాట ..అయన అనుసరించిన మార్గంలో నడిచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని జగన్ చెప్పారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat