తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వినూత్న కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సంగతి తెల్సిందే.ఒకవైపు పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతుండగా మరోవైపు పార్టీను బలోపేతం చేయడానికి పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలను గెలుపొందాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో జనహిత ప్రగతి సభలను నిర్వహించాలి .ప్రభుత్వం చేపట్టిన చేపట్టబోతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను ఎలా అడ్డుకుంటున్నారు.
కేసులు ఎలా వేస్తున్నారు.గతంలో అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ ప్రజలకు ఎలా అన్యాయం చేశారు ఇలా తదితర అంశాల గురించి వివరిస్తూ చైతన్యం తీసుకురావాలని ఆలోచిస్తున్నారు అని సమాచారం .మరో రెండు మూడు నెలల్లో ఇలా నిరంతరంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది ..