ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,వరప్రసాద్,అవినాష్ రెడ్డి ,మేకపాటి గత ఆరు రోజులుగా అమరనిరహర దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వయస్సులో పెద్దవారు కావడంతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మేకపాటి,వరప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో
పోలీసులు అరెస్టు చేసి ముగ్గుర్ని ఆర్ఆర్ ఎల్ ఆస్పత్రికి తరలించారు.
తాజాగా గత ఆరు రోజులుగా అమర నిరహార దీక్ష చేస్తున్న యువ ఎంపీలు మిథున్ రెడ్డి ,అవినాష్ రెడ్డి ల ఆరోగ్య పరిస్థితులు విషమించడంతో పోలీసులు అరెస్టు చేసి బలవంతంగా తరలించారు.దీంతో ఢిల్లీలో ఎంపీలు దీక్ష చేస్తున్న ఏపీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి.ఎంపీలను అరెస్టు చేస్తున్న పోలీసులను అడ్డుకోవడంతో వైసీపీ నేతల,కార్యకర్తలపై పోలీసులు జూలు విదిలించారు .దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి .