ఆమె నిండు గర్భిణీ ..పాట పాడలేదు అని ఏకంగా నిలబెట్టి అత్యంత దారుణానికి పాల్పడ్డారు .అసలు విషయానికి పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ గాయనీ అయిన ఇరవై నాలుగు ఏళ్ళ సమీనా సమూన్ మొన్న మంగళవారం నాడు సాయంత్రం సింద్ ప్రావిన్స్ లోని కంగా గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో సంగీత ప్రదర్శన ఇచ్చింది.అయితే ఆమె ఆరు నెలల గర్భిణీ కావడంతో కూర్చొనే పాటలు పాడింది.
అక్కడ ఉన్న తారిఖ్ అహ్మద్ జటోయ్ అని వ్యక్తీ సమీనాను నిలబడాలని పలుమార్లు అడిగాడు.అయితే తను గర్భిణీ కావడంతో నిల్చొని పాడలేను..అందుకు తను ఎదుర్కుంటున్న సమస్యలు గురించి ఆమె వివరించింది.అయితే వేదికపై ఆమెతో ఉన్నవారు సమీనాను నిలబడమని అడిగి ఒప్పించారు .
చేసేది ఏమిలేక ఆమె అలా నిలబడగానే బాగా పీకల్లోతు త్రాగి ఉన్న తారిఖ్ తన దగ్గర ఉన్న తుపాకీను తీసి ఆమె నుదుటిపై కాల్చాడు .దీంతో సమీనా అక్కడక్కడే ప్రాణాలను కోల్పోయింది.అయితే హత్య జరిగిన రెండు రోజుల తర్వాత దాని గురించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ..వీడియో కోసం కింద చూడండి ..