తెలంగాణ రాష్ట్రంలో సర్కారీ నౌకరీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురునందించింది .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు సర్కారు డిగ్రీ కళాశాల్లో కొత్తగా పదమూడు వందల ఎనబై నాలుగు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే 2008కంటే ముందున్న అప్పటి డిగ్రీ కళాశాల్లో మొత్తం మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులు ,ఆ తర్వాత ప్రారంభమైన మరో యాబై ఏడు కొత్త కళాశాల్లో ఒక వెయ్యి పది పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్ నిన్న గురువారం ఉత్తర్వులను జారిచేశారు.
మొత్తం నూట పదిహేను కళాశాల్లో ప్రిన్సి పాల్ పోస్టులు పదిహేను ,డిగ్రీ లెక్చరర్లు ఒక వెయ్యి న్రెండు వందల పద్నాలుగు ,ఫిజికల్ డైరెక్టర్ అరవై ఏడు పోస్టులు ,లైబ్రేరియన్ అరవై నాలుగు,అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ పోస్టులు ఇరవై నాలుగు ఉన్నాయి ..