టీం ఇండియా సీనియర్ మాజీ క్రికెటర్లు ,లెజెండ్రీ ఆటగాళ్ళు రాహుల్ ద్రావిడ్,అనిల్ కుంబ్లే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి బిగ్ షాకిచ్చారు.కర్ణాటక రాష్ట్రంలోని విధానసభ ఎన్నికల్లో మిషన్ -150 టార్గెట్ ను చేరుకునే దిశగా ఆ పార్టీ రూపొందించిన ప్రణాళికలను అమలు చేస్తుంది .
అందులో భాగంగా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ ఆటగాళ్ళకు గాలం వేసింది.ఈ క్రమంలో టీం ఇండియాకు చెందిన మాజీ ఆటగాళ్ళు అయిన రాహుల్ ,కుంబ్లేలను బీజేపీ పార్టీలో చేర్చుకోవాలని పలు ప్రయత్నాలు చేసింది.
అయితే వీరిద్దరూ ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సుముఖుత వ్యక్తం చేయలేదని సమాచారం .వీరిద్దర్నీ చేర్చుకోవాలని ఆ పార్టీ నేతలు పలు మార్లు ఈ ఇద్దరు లెజెండ్రీ ఆటగాళ్ళను కలసిన కానీ ఫలితం లేకపోయింది.అయితే ప్రస్తుతం తమకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు అంట .