ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం ఓవర్లు ఆడి ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ముప్పై ఎనిమిది పరుగులను సాధించింది.
కేకేఆర్ జట్టులో లిన్ నలభై తొమ్మిది ,కార్తీక్ ఇరవై తొమ్మిది పరుగులను సాధించగా హైదరాబాద్ జట్టులో భువనేశ్వర్ మూడు ,స్టాన్ లేక్ రెండు వికెట్లను దక్కించుకున్నారు . తర్వాత నూట ముప్పై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ పంతొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది . హైదరాబాద్ కెప్టెన్ విలియమ్స్ న్ యాభై పరుగులతో రాణించాడు ..కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్ రెండు ,పీయూష్ చావ్లా ఒకటి ,కుల్దీప్ యాదవ్ ఒక వికెటును దక్కించుకున్నాడు .