అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు మహీ వీ రాఘవ్ యాత్ర అనే సరికొత్త మూవీను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే.అయితే ఈ మూవీలో వైఎస్సార్ పాత్రలో స్టార్ హీరో మమ్ముట్టీ నటిస్తుండగా వైఎస్ విజయమ్మ పాత్రలో నటించేది ఎవరో వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి .
అందులో భాగంగా ఇటివల సిరిస్ గా విడుదలై ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా యావత్తు ప్రపంచ సినీ వర్గాలను షాక్ కు గురిచేస్తూ రికార్డులను అన్నిటిని బద్దులు కొడుతూ తెలుగు సినిమా ఖ్యాతీను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలి మూవీలో నటించిన నటిమణి పేరు ప్రస్తుతం విజయమ్మ పాత్రలో నటించనున్నారు అని వార్తలు వస్తున్నాయి .
ప్రభాస్ ,అనుష్క హీరో హీరోయిన్లగా జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి పార్ట్ టూ లో అనుష్కకు వదినగా నటించిన అశ్రీతా వేముగంటి ను వైఎస్సార్ బయో పిక్ లో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ పాత్రకు ఎంపిక చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి .అయితే వార్తలను దర్శకుడు రాఘవ్ ఇంకా అధికారకంగా కన్ఫామ్ చేయలేదు ..