పెట్టుబడిదారులకు తెలంగాణ రాష్ట్ర కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఐఎస్బీలో అభివృద్ధి కొరకు ఆర్థిక దౌత్యంపై ఏర్పాటు చేసిన సదస్సుకు కేంద్రమంత్రి వీకేసింగ్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.సులభతర వాణిజ్య విధానం అమలులో తెలంగాణ ముందుందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూములు రాష్ట్రంలో ఉన్నాయి. విదేశాల నుంచి పెట్టుబడులు సేకరించడంలో రాష్ర్టాలకు విదేశాంగ శాఖ సహకరించాలని కోరారు. ప్రభుత్వాల ప్రధాన ధ్యేయం ఉద్యోగాలు కల్పించడమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ ముందుందన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త పాలసీలు తెచ్చామని పెట్టుబడుల కేంద్రంగా మార్చామన్నారు మంత్రి కేటీఆర్.
IT & Industries Minister @KTRTRS addressing the delegates at the inaugural session of #DeccanDialogue, a Conference on Economic Diplomacy for Development, organised by @ISBedu in association with @MEAQuery, Government of India. pic.twitter.com/5iEdDyIOb0
— Min IT, Telangana (@MinIT_Telangana) May 6, 2018