టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్పై సంచలన ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి తాజాగా మరిన్ని హాట్ కామెంట్స్ చేసింది. పలువురి మీద సంచలన కామెంట్తో శ్రీరెడ్డి కలకలం రేపుతున్నది. కొద్దిరోజులు మౌనం వహించిన ఆమె తాజాగా మరోసారి సినీ ప్రముఖులపై గురిపెట్టింది. నిర్మాత సురేష్బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. ఇటీవల శ్రీ రెడ్డి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ పై సంచలన ఆరోపణలు చెయ్యడమే కాకుండా అభిరామ్ తో దిగిన ఫోటోలను లీక్ చెయ్యడం జరిగింది. అక్కడితో ఆ విషయాన్ని శ్రీ రెడ్డి మర్చిపోయింది అనుకునే సరికి తాజాగా ఆమె నిర్మాత సురేష్ బాబుపై మరోసారి ఆరోపణలు చేసింది. ఆమె ఏమన్నారంటే.. ”సురేష్ మామ ఎలా వున్నావ్, ఆరోగ్యం జాగ్రత్త, ఎండలు బాగా వేస్తున్నాయి బయట, ఇంట్లోనే గమ్మునుండు” అని శ్రీరెడ్డి కామెంట్ చేయడం గమనార్హం. గతంలో అభిరామ్ దగ్గుబాటితో అతిసన్నిహితంగా ఉన్న ఫోటోలను ప్రముఖ టెలివిజన్ ఛానెల్లో శ్రీరెడ్డి లీక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీ రెడ్డి ట్వీట్ల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
సురేష్ మామ ఎలా వున్నావ్, ఆరోగ్యం జాగ్రత్త, ఎండలు బాగా వేస్తున్నాయి బయట, ఇంట్లోనే గమ్మునుండు ???
— Sri Reddy (@MsSriReddy) May 7, 2018