ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలుగు రాష్ట్రలో రాజకీయం వేడెక్కింది.వారి భవిష్యత్ కోసం ఇప్పటినుండే నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి చేరుతున్నారు.అందులో భాగంగానే ఇప్పటికే తెలంగాణలో కొంతమంది నేతలు ప్రస్తుత అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరగా తాజాగా ఖమ్మం జిల్లా అశ్వాపురం సీనియర్ నేత, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు.
ఈ మేరకు మల్లారెడ్డి చేరికకు రంగం సిద్ధమయ్యింది. ఈ సందర్భంగానే అయన టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఇవాళ మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా ఆయన మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు నెల్లిపాక సింగిల్ విండో చైర్మన్ మర్రి మల్లారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు తెలిసింది. కొల్లు మల్లారెడ్డి టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. అభివృద్ధి కోసమే తాను టీఆర్ఎస్లో చేరనున్నట్టు చెప్పారు.