కాంగ్రెస్ నేత,కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.మొత్తానికి తన మనసులోని మాటను చెప్పేశారు.ఎప్పటికైనా తన లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ నే అని అన్నారు.వివరాల్లోకి వెళ్తే…రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.ఈ సందర్భంగా తన మనసులోని మాటను చెప్పేశారు.
‘నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర టీం లీడర్ సరిగా వాడుకోవడం లేదు.ఉత్తమ్ కు సలహాలిచ్చే వారు సరిగా లేరు. నాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా తీసుకోను. ఆ పదవి వద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. నా హోదాకు తగిన పదవిని ఆశిస్తున్నాను. ఎప్పటికైనా నా లక్ష్యం సీఎం కుర్చీనే.కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్ల శాసనసభ్యత్వాల రద్దుకు నిరసనగా గాంధీభవన్లో 48 గంటల దీక్ష చేపట్టాలని తానే సలహా ఇచ్చినట్లు ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.