Home / SLIDER / ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడు..!!

ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడు..!!

ఆరు నూరైన కోటి ఎకరాలు పచ్చబడే వరకు ఈ కేసీఆర్ నిద్రపోడని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు .కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో జరిగిన రైతు బంధు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.కోటి ఎకరాలు పచ్చపడేదాక నిద్రపోయేది లేదని.. ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా అనుకున్న ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విత్తనాల కోసం రైతులు క్యూలో నిలుచునే వాళ్లని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలు లభిస్తున్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు .

అర్హులైన అందరికీ ఫెన్షన్ ఇస్తామన్నారు. రైతులకు బీమా చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. జూన్ 2 నుంచి రైతులకు 5లక్షల బీమా అమలు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ యాదవులు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు సంపాధించారన్నారు. ఏ ఒక్క కులం, మతం అని కాకుండా అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ ..తెలంగాణ అంటే టీఆర్ఎస్ ఎవరు ఎన్ని చెప్పిన ..అసత్యాలు ప్రచారం చేసిన సత్యం ఒకటే ..
అదే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ .ప్రజలు ఎప్పుడు ధర్మం, న్యాయం వైపే ఉంటారని అన్నారు.దేశంలో ధనికులైన రైతాంగం ఎక్కడుందంటే తెలంగాణ అని ఆనలే..రాబోవు రోజుల్లో మద్ధతు ధర కోసం కోట్లాడతాం వ్యవసాయం అంటే దండగ కాదు పండగని దేశానికి చాటాలి అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat