Home / POLITICS / ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!

ఎమ్మెల్యే చిన్నారెడ్డికి చుక్కలు చూపించిన రైతన్నలు..!!

గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించిన రైతుబంధు పథకానికి  రాష్ట్రవ్యాప్తంగా నే కాకుండా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి చెక్కులను రైతులు తమ కళ్ళకు అద్దుకొని తీసుకుంటున్నారు.మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం ఈ పథకంపై బురద జల్లుతుంది.రైతులకు అండగా నిలిచే రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ పార్టీ కడుపు మండుతోంది. రైతన్నలు పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకుంటుంటే ఆ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారు.

వనపర్తిలో ఏర్పాటు చేసిన చెక్కులు, పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేయబోయారు.వనపర్తి జిల్లా పెద్ద మందడి మండలం మనిగిల్ల గ్రామంలో రైతులు తిరగబడి చిన్నారెడ్డి నోరు మూయించారు. మూకుమ్మడిగా వేదికవైపు రైతులు దూసుకురావడంతో రైతు సమన్వయ సమితి సభ్యులు వారిని సముదాయించారు. దీంతో, చెక్కుల పంపిణీ కార్యక్రమం నుంచి చిన్నారెడ్డి మెల్లగా జారుకున్నారు.ఇన్ని రోజులు  ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినప్పుడు నువ్వెందుకు   వ్యవసాయానికి సాగునీరు ఇవ్వలేదని రైతన్నలు ప్రశ్నలవర్షం కురిపించారు.

Image may contain: 9 people, crowd

Image may contain: 12 people, wedding

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat