టీడీపీ నేతలు కామాంధుల్లా, పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పసివాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త అన్నం సుబ్బయ్య బాలికపై అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే దాచేపల్లిలో మరో టీడీపీ నేత కీచక పర్వం కలకలం రేపింది. దాచేపల్లి, ఈ పేరు వింటే గుర్తొచ్చేది చిన్నారిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం. ఊళ్లో రిక్షా తొక్కుతూ జీవనం సాగించే అన్నం సుబ్బయ్య మనుమరాలి వయసు ఉన్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి పారిపోవడంతో ఊరు ఊరంతా భగ్గుమంది. కొన్ని గంటల్లోనే ఆ కామాంధుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది. ఇదంతా జరిగింది గత వారమే.
see also : పక్కలోకి రమ్మనే వాళ్లు ఉన్నారు..!!
ఇప్పుడు అదే దాచేపల్లిలో మరో దారుణం బయటపడింది. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేశాడు ఓ కామాంధుడు. దాచేపల్లిలో టీడీపీ మండల కో ఆప్షన్ సభ్యుడు మాబూవలీ వ్యాపారం చేస్తున్నాడు. తన దగ్గర పనిచేసేందుకు వచ్చిన బాలికపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదులే అనుకున్నాడు కానీ.. చేసిన పాపం ఎట్టకేలకు బయటపడింది. కొంత కాలంగా బాలిక ఆరోగ్యం బాగులేకపోవడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్ ఆ బాలిక గర్భవతి అని నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఏం జరిగిందని ఆ బాలికను తల్లిదండ్రులు ఆరా తీస్తే టీడీపీ నేత మాబూవలీ కీచకపర్వం బయటపడింది.
దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు చేసేది లేక టీడీపీ నేత మాబూవలీ కీచకపర్వంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.