మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుడుతావుంటారట. చరిత్ర ని చదివి వర్తమానాన్ని పరిశీలిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ప్రపంచదేశాలు యుద్ధాలు చేసి అలిసి ప్రజల గురించి పట్టించుకోలేదు. ప్రపంచయుద్ధం తర్వాత భూమండలం అంతా ఆర్ధిక సంక్షోభం లో కూరుకుపోయి తిండే కరువైన రోజుల్లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ప్రజల బాధలను గట్టెక్కించడానికి “న్యూ డీల్ సంస్కరణ” ల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పనికి ఆహార పథకానికి మొగ్గ తొడిగింది అప్పుడే. బువ్వ దొరక్క మట్టిబొక్కుతుంటే ప్రజలకు పని కల్పించి బువ్వ పెట్టిండు.
తూ తూ మంత్రం పనులు కాకుండా ఆనకట్టలు నిర్మించిండు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అలా ఉంటాడు.అదిగో అలాంటి లీడరే తెలంగాణాలో పుట్టిండు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర రావు. అటు సాగుకు ఇటు తాగటానికి గుప్పెడు నీళ్లు లేని తెలంగాణాకు నీళ్లు తెచ్చిన భగీరథుడు ఆయన. పాలమూరు లో పిట్టల మూతికి అందని నీళ్లు ఇవాళ చెరువుల్లో చేరి దరహాసం చేస్తున్నాయి. ఏడ చూసినా నీళ్లే. ఆకలిచావులు, రైతు ఆత్మహత్యలు అంటూ పేపర్లలో ఒక్కవార్త కూడా కనిపించ కూడదు. తొలకరి వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం దిగులు పడే రైతన్న కష్టం తీర్చడానికి పంటసాయం చేసిన కె.సి.ఆర్ ఎంత గొప్ప నాయకుడో అభివర్ణించలేము.
రైతు బిడ్డనని చెప్పుకొన్న గత ముఖ్యమంత్రికి ఈ ఆలోచన ఎందుకు రాలేదో మరి. ప్రపంచ స్వేచ్చా వ్యాపారానికి మార్గం వేసిన ‘డంకెల్’ రైతులకు పంట ప్రోత్సవహకాలు ఇవ్వొద్దని ప్రతిపాదనలు చేశాడు. ఆయన ప్రతిపాదనలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవ్వాళ “రైతుబంధం” పథకం తో కె.సి.ఆర్ ‘డంకెల్’ చెంపచెల్లు మనిపించాడు. ప్రజల నుండి వచ్చిన నాయకుడు ప్రభుత్వాధినేత అయితే మార్పు ఎలా ఉంటదో మన ముఖ్యమంత్రి చేసి చూపించారు. కె.సి.ఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.By Venugopal Rao