Home / ANDHRAPRADESH / ఎంపీ సీఎం రమేష్ ను కాల్చి పారేసే రోజులు వస్తాయి .మంత్రి ఆదినారాయణ ..!

ఎంపీ సీఎం రమేష్ ను కాల్చి పారేసే రోజులు వస్తాయి .మంత్రి ఆదినారాయణ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత మంత్రిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు ,రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .

గత కొంతకాలంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి ,ఎంపీ రమేష్ కు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న పరిస్థితి మనకు తెల్సిందే.తాజాగా జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది కాంట్రాక్టులు ,రోడ్ల పనులు చేస్తూ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు .అంతే కాకుండా తమపై నీచంగా ఆరోపణలు చేస్తూ తుచ్చ రాజకీయాలకు పాల్పడుతున్నారు .

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నియోజకవర్గంలో పనులు చేసుకుంటున్నారు ..ఇక్కడ ఉన్న నాయకులు వందల కోట్లను వెనకేసుకుంటున్నారు .అసలు ఏమి జరుగుతుందో తెలియకుండా రమేష్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు .ఆయన ఎదురుపడితే కాల్చి పారేసేరోజులు వస్తాయి అని అన్నారు అని వార్తలు ఒక ప్రముఖ పత్రికలో వచ్చాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat