ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు.
దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన ఆరోపణల మీద సీబీఐ విచారణ చేయిస్తే నిజనిజాలు బయటకు వస్తాయి .వాటిని నిరూపించడానికి సిద్ధమని ఆయన తెలిపారు .
అంతే కాకుండా ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి పోటును మూసేసి తవ్వకాలను జరిపారని పునరుద్ఘాటించారు.పింక్ డైమండ్ విషయంలో ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా నిజాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అని ఆయన మండి పడ్డారు ..