రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు ప్రజా ప్రతి నిధులు ఎక్కడికి వెళ్లిన ప్రజలు, రైతులు బ్రహ్మరథం పట్టి గ్రామాలకు స్వాగతిస్తున్నారు.
అటు రైతుకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ పై అన్నదాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంతోషంగా చెక్కులను అందుకున్న రైతులు.. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.గత 60 ఏండ్ల నుంచి రైతులకోసం ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఆలోచించలేదని రైతులు అంటున్నారు.దేశవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతుంది.ఇప్పటికే ఈ పథకాన్ని పలువురు ముఖ్యమంత్రులు,జాతీయ నాయకులూ ప్రశంసిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనుసంధానం చేసిన 52,72,779 మందికి చెక్కులు, పాస్ పుస్తకాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు.అంతేకాదు నడవలేని స్థితిలో ఉన్న వారికీ అధికారులు,నాయకులూ వారి ఇంటికే వెళ్లి చెక్కులు ,పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.అయితే రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని జూన్ 2నుండి రైతు బీమా పథకాన్ని ప్రారంభించనుంది.ఇప్పటికే రైతుల గుండెల్లో గుడి కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకంతో మరింత దగ్గర కాబోతున్నారు.