Home / SLIDER / ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం

ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యలేమున్నా పరిష్కరించి, అందరికీ పాసుపుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని, జూన్ 2న కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలులోకి వచ్చే నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపిణీ కార్యక్రమం పూర్తి కావాలని ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వరకు జరిగిన పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు, జూన్ 2 నాటికి మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మద్యాహ్నం ఒంటి గంటకు అత్యవసర సమావేశం నిర్వహిస్తారు.

ఎక్కడికీ తిరగకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా భూమి రికార్డులు సరిచేసి కొత్త పాసుపుస్తకాలు ఇవ్వడం పట్ల, పంట పెట్టుబడి సాయం అందివ్వడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నదని సీఎం అన్నారు. భారతదేశంలో మరే ప్రభుత్వ కార్యక్రమానికి రానంత గొప్ప స్పందన రైతుబంధుకు వస్తున్నదని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి మిగతా రైతులకు కూడా పాసుపుస్తకాలు, చెక్కులు పంపిణీ చేసి కార్యక్రమాన్ని వందకు వంద శాతం దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టిన సందర్భంలో హాజరు కాలేకపోయిన వారు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి పాసు బుక్కులు, చెక్కులు తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

Image may contain: 2 people, people sitting and indoor

పాసు బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమంపై ప్రగతి భవన్ లో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, హరీష్ రావు, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, ఎంపిలు జె. సంతోష్ కుమార్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ఎండిసి చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్థన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్సీలు సలీం, శ్రీనివాస రెడ్డి, సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘‘రైతుల సంక్షేమానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరోటి లేదు. అందుకే వ్యవసాయ రంగానికి ఎక్కువ నిధులిస్తున్నాం. రైతులకు మేలు చేయగలిగితేనే సాధించిన తెలంగాణకు సార్థకత. 12వేల కోట్లతో రైతు బంధు కార్యక్రమం అమలు చేస్తుంటే చాలా మంది భయపడ్డారు. కానీ రైతులకు నేరుగా మేలు చేసే కార్యక్రమం కాబట్టి మొండి పట్టుదలతో ముందుకుపోయాం. పంట పెట్టుబడికోసం ప్రభుత్వం అందించిన సాయం చేతికందిన తర్వాత రైతుల్లో చెప్పలేని ఆనందం వెల్లివిరుస్తోంది. అప్పుల బాధలు తప్పాయని ఊరట చెందుతున్నారు. రికార్డు సమయంలో భూ రికార్డుల ప్రక్షాళన చేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందించడం సాధారణ విషయం కాదు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడికి తిరగకుండా భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంత పెద్ద పని చేసిన రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సిబ్బంది అభినందనీయులు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఎన్నో పథకాలు తెస్తుంది. కానీ పంట పెట్టుబడి పథకానికి వచ్చినంత గొప్ప స్పందన మరే కార్యక్రమానికి రాలేదు. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ప్రశంసలు లభిస్తున్నాయి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

‘‘ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల కొన్ని చోట్ల రైతులకు పాసు పుస్తకాలు అందలేదు. చెక్కులు చేతికి రాలేదు. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగానూ వ్యవహరించారు. భూ రికార్డులు సరిచేసే కార్యక్రమాన్ని కూడా కొన్న చోట్ల సరిగా నిర్వహించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం రైతుల కోసం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అధికారులు కొన్ని చోట్ల అందుకు అనుగుణంగా విధులు నిర్వహించక పోవడం అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగాలి. ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాలి. జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వస్తుంది. అప్పటికి అందరి వద్ద కొత్త పాసు పుస్తకాలుండాలి. రికార్డులన్నీ అప్డేట్ అయి ఉండాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం వరకు జరిగిన పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించడంతో పాటు, జూన్ 2 నాటికి మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని ముగించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, కలెక్టర్లతో బుధవారం మద్యాహ్నం ఒంటి గంటకు అత్యవసర సమావేశం నిర్వహిస్తారు. ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు పాసు పుస్తకాలు, చెక్కులు అందించారు? ఇంకా ఎన్ని మిగిలాయి? ఎందుకు మిగిలాయి? వారికి బుక్కులు, చెక్కులు ఎప్పుడిస్తారు? అసలు ఏ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి? తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. జూన్ 2లోగా పంపిణీ కార్యక్రమం పూర్తి కావడానికి అవసరమైన వ్యూహం ఖరారు చేస్తారు. రైతులకు జీవిత బీమా పథకం, కంటి వెలుగు, రాష్ట్ర అవతరణ వేడుకలు, పంచాయితీ రాజ్ ఎన్నికల ఏర్పాట్లు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat